ఏపీలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

298 New corona cases in AP.ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంట‌ల్లో 45,664 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 298 పాజిటివ్ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2021 1:16 PM GMT
AP Corona cases

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంట‌ల్లో 45,664 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 298 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,91,861కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 90 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 32, విశాఖ జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,83,277కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య‌ 7,184కి చేరింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,45,34,762 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో వెల్ల‌డించింది.



Next Story