ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
2665 New Corona Cases Reported In AP. నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి.
By Medi Samrat Published on 11 July 2021 2:14 PM GMT
నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 91,677 శాంపిళ్లను పరీక్షించగా.. 2,665 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,22,843కి చేరింది. నిన్న 3,231 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,81,161కి పెరిగింది.
#COVIDUpdates: 11/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 11, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,19,948 పాజిటివ్ కేసు లకు గాను
*18,78,266 మంది డిశ్చార్జ్ కాగా
*13,002 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 28,680#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/30tCjmLAGv
కోవిడ్ వల్ల తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, శ్రీకాకుళం లో ఇద్దరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,002కి చేరింది. ఇక రాష్ట్రంలో 28,680 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,29,86,288 సాంపిల్స్ ని పరీక్షించారు.