ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. మరోమారు వందకు పైగా మరణాలు
23160 New Corona Cases reported In AP. ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,01,330 శాంపిళ్లను పరీక్షించగా.. 23,160 పాజిటివ్ కేసులు నమోదు.
By Medi Samrat Published on 19 May 2021 1:03 PM GMT
ఏపీలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,01,330 శాంపిళ్లను పరీక్షించగా.. 23,160 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరింది. నిన్న 24,819 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 12,79,110కి పెరిగింది.
#COVIDUpdates: 19/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 19, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,95,637 పాజిటివ్ కేసు లకు గాను
*12,76,215 మంది డిశ్చార్జ్ కాగా
*9,686 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,09,736#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/q8zEjJCrJg
కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరి లో పదిహేడు మంది, నెల్లూరు లో పదకొండు మంది, విశాఖపట్నం లో పదకొండు మంది, తూర్పు గోదావరి లో తొమ్మిది, విజయనగరం లో తొమ్మిది, అనంతపూర్ లో ఎనిమిది, చిత్తూర్ లో ఎనిమిది, కృష్ణలో ఎనిమిది, శ్రీకాకుళం లో ఎనిమిది, గుంటూరు లో ఏడుగురు, కర్నూల్ లో ఐదుగురు, ప్రకాశం లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు చొప్పున మొత్తం 106 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9,686కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,09,736 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,82,41,637 సాంపిల్స్ ని పరీక్షించారు.