ఏపీ కరోనా బులిటెన్.. మళ్లీ పెరుగుతున్న కేసులు
2209 New Corona Cases Reported In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,505 శాంపిళ్లను పరీక్షించగా..
By Medi Samrat Published on 6 Aug 2021 11:42 AM GMT
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,505 శాంపిళ్లను పరీక్షించగా.. 2,209 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,78,350కి చేరింది. నిన్న 1,896 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,44,267కి పెరిగింది.
#COVIDUpdates: 06/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 6, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,75,455 పాజిటివ్ కేసు లకు గాను
*19,41,372 మంది డిశ్చార్జ్ కాగా
*13,490 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20,593#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Aa8TZsg6Vo
కోవిడ్ వల్ల కృష్ణలో ఆరుగురు, గుంటూరు లో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడప, శ్రీకాకుళం , విశాఖపట్నం, పశ్చి మ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 22. మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,490కి చేరింది. ఇక రాష్ట్రంలో 20,593 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,50,27,770 సాంపిల్స్ ని పరీక్షించారు.