ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

21452 New Corona Cases reported In AP. ఏపీలో . గ‌డిచిన 24 గంట‌ల్లో 90,750 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 21,452 పాజిటివ్ కేసులు న‌మోదు

By Medi Samrat  Published on  12 May 2021 1:28 PM GMT
AP Corona cases

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 90,750 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 21,452 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 13,44,386కి చేరింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా తూర్పుగోదావ‌రి జిల్లాలో 2,927 మంది, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అత్య‌ల్పంగా 693 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

కోవిడ్ వల్ల విశాఖ‌లో పద‌కొండు మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది, కృష్ణ‌లో తొమ్మిది, విజయనగరంలో తొమ్మిది, చిత్తూరులో ఎనిమిది, నెల్లూరులో ఎనిమిది, గుంటూరులో ఎనిమిది, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంత‌పురంలో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, ప్ర‌కాశంలో న‌లుగురు, ప‌శ్చిమ గోదావ‌రిలో ముగ్గురు, క‌డ‌ప‌లో ఇద్ద‌రు చొప్పున మొత్తం 89 మంది క‌రోనా కార‌ణంగా మరణించారు. దీంతో మ‌హ‌మ్మారి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 8,988కి చేరింది. నిన్న 19,095 మంది కోలుకోగా.. మొత్తంగా క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 11,38,028కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో 1,76,05,687 సాంఫిల్స్‌ను ప‌రిక్షించారు.




Next Story