ఏపీ క‌రోనా బులిటెన్‌ : భారీగా న‌మోదైన‌ కేసులు, మ‌ర‌ణాలు

20937 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 92,231 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 20,937 పాజిటివ్ కేసులు న‌మోదు.

By Medi Samrat  Published on  21 May 2021 12:23 PM GMT
AP Corona cases

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 92,231 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 20,937 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15,42,079కి చేరింది. నిన్న 20,811 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 13,23,019కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదిహేను మంది, ప్రకాశం లో పది, విజయనగరం లో పది, తూర్పు గోదావరి లో తొమ్మిది, నెల్లూరు లో తొమ్మిది, విశాఖపట్నం లో తొమ్మిది, కృష్ణ లో ఎనిమిది, అనంతపూర్ లో ఏడుగురు, గుంటూరు లో ఏడుగురు, కర్నూల్ లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో ఆరుగురు చొప్పున మొత్తం 104 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9,904కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,84,35,149 సాంపిల్స్ ని పరీక్షించారు.




Next Story