ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు, మ‌ర‌ణాలు

1869 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 71,030 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 1,869

By Medi Samrat  Published on  11 Aug 2021 10:36 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు, మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 71,030 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 1,869 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,87,051కి చేరింది. నిన్న 2,316 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,55,052కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, అనంతపూర్, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి లలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 18 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,582కి చేరింది. ఇక రాష్ట్రంలో 18,417 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,53,82,763 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story