ఏపీలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం.. ఒకేరోజు భారీగా మ‌ర‌ణాలు

18561 New Corona Cases Reported In AP. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 73,749 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా..18,561 పాజిటివ్ కేసులు న‌మోదు

By Medi Samrat
Published on : 17 May 2021 4:51 PM IST

AP Corona cases

ఏపీలో క‌రోనా విల‌యం కొనసాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 73,749 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 18,561 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052కి చేరింది. నిన్న 17,334 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 12,33,017 కి పెరిగింది.

కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరి లో పదహారు మంది, అనంతపూర్ లో పది మంది, చిత్తూర్లో పది మంది, గుంటూరు లో పది మంది, తూర్పు గోదావరి లో తొమ్మిది, విశాఖపట్నంలో తొమ్మిది, కృష్ణలో ఎనిమిది, నెల్లూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, కర్నూల్ లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, ప్రకాశం లో నలుగురు, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు చొప్పున మొత్తం 109 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9,481కి చేరింది. ఇక రాష్ట్రంలో 2,11,554 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 1,80,49,054 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story