ఏపీ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్ని కేసులంటే..?
175 New corona cases in AP.ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,448 కరోనా పరీక్షలు
By తోట వంశీ కుమార్
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,448 కరోనా పరీక్షలు నిర్వహించగా 175 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,91,563కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 కొత్త కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 24, విశాఖ జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 132 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,83,113కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,268 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,182కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,44,89,098 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో వెల్లడించింది.
#COVIDUpdates: 13/03/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 13, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,88,668 పాజిటివ్ కేసు లకు గాను
*8,80,218 మంది డిశ్చార్జ్ కాగా
*7,182 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,268#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/nSMa1WgTjr