ఏపీలో త‌గ్గ‌ని క‌రోనా మ‌ర‌ణాలు

14986 New Cases reported In Andhra Pradesh. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 60,124 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 14,986 పాజిటివ్ కేసులు న‌మోదు

By Medi Samrat  Published on  10 May 2021 12:37 PM GMT
AP Corona cases

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 60,124 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 14,986 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 13,02,589కి చేరింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా తూర్పుగోదావ‌రిలో 2,352 మంది, ప‌శ్చిమ‌గోదావ‌రిలో అత్య‌ల్పంగా 423 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో పన్నెండు మంది, గుంటూరు లో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో పది మంది, విశాఖపట్నం లో తొమ్మిది మంది, నెల్లూరు లోఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, చిత్తూర్ లో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, కృష్ణ లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కడపలో ఇద్దరు చొప్పున మొత్తం 84 మంది క‌రోనా కార‌ణంగా మరణించారు. దీంతో మ‌హ‌మ్మారి రాష్ట్రంలో మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 8,791కి చేరింది. నిన్న 16,167 మంది కోలుకోగా.. మొత్తంగా క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 11,04,431కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,89,367 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో 1,74,28,059 సాంఫిల్స్‌ను ప‌రిక్షించారు.


Next Story