ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

1365 New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 56,720 పరీక్షలు

By Medi Samrat  Published on  22 Sep 2021 12:45 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 56,720 పరీక్షలు నిర్వహించగా.. 1,365 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,42,073కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఎనిమిది మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,097కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,466 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,14,180కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,796 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,78,70,218 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story