ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నికేసుంటే..?
136 New corona cases in AP. గడిచిన 24 గంటల్లో 45,702 కరోనా పరీక్షలు నిర్వహించగా 136 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 7 March 2021 1:32 PM GMT
#COVIDUpdates: 07/03/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 7, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,797 పాజిటివ్ కేసు లకు గాను
*8,79,625 మంది డిశ్చార్జ్ కాగా
*7,174 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 998#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/zpbCYbXoGT
నిన్నటి పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 45,702 కరోనా పరీక్షలు నిర్వహించగా 136 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 49 కొత్త కేసులు నమోదు కాగా.. గుంటూరు జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 14 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు మాత్రమే నమోదైంది. అదే సమయంలో 58 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,82,520కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 998 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,174కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,42,36,179 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో వెల్లడించింది.