ఏపీలో భారీగా క‌రోనా మ‌రణాలు

12,634 New Corona Cases In AP. ఆంధ్రప్రదేశ్‌లో గ‌డిచిన‌ 24 గంటల్లో 62,885 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 12,634 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి.

By Medi Samrat  Published on  25 April 2021 12:44 PM GMT
AP Corona cases

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 62,885 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 12,634 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ పాజ‌టివ్ కేసుల సంఖ్య 10,33,560 కు చేరింది. అత్య‌ధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1,680 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా క‌డ‌ప‌ జిల్లాలో 219 కేసులు చొప్పున‌ న‌మోదు అయ్యాయి.

కోవిడ్ వల్ల నిన్న ఒక్క‌రోజే కోవిడ్ వల్ల కృష్ణలో పన్నెండు మంది, నెల్లూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, పశ్చి మ గోదావరిలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, వైఎస్ఆర్ కడపలో ఐదుగురు, చిత్తూర్ లో నలుగురు, గుంటూరు లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కర్నూ ల్ లో ఇద్దరు చొప్పున మొత్తం 69 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,685కి చేరింది. నిన్న ఒక్క రోజే 4,304 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 9,36,143కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 89,732 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,59,94,607 శాంపిల్స్ ను పరీక్షించారు.


Next Story