ఏపీ కరోనా హెల్త్ బులెటిన్.. కొత్తగా ఎన్నికేసులంటే..?
117 New corona cases in AP.ఏపీలో గడిచిన 24 గంటల్లో 39,122 కరోనా పరీక్షలు నిర్వహించగా 117 పాజిటివ్ కేసులు నిర్థరాణ
By తోట వంశీ కుమార్ Published on
28 Feb 2021 1:17 PM GMT

ఏపీలో గడిచిన 24 గంటల్లో 39,122 కరోనా పరీక్షలు నిర్వహించగా 117 పాజిటివ్ కేసులు నిర్థరాణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,89,916కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 41 కేసులు నమోదు కాగా, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. అదే సమయంలో 66 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,82,029కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 7,169. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,39,54,131 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో వెల్లడించింది.
Next Story