ఏపీ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్ని కేసులంటే..?
115 New corona cases in AP.ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,566 కరోనా పరీక్షలు 115 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 6 March 2021 12:38 PM GMT
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,566 కరోనా పరీక్షలు నిర్వహించగా 115 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,90,556కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 32 కొత్త కేసులు నమోదు కాగా.. కృష్ణా జిల్లాలో 20, విశాఖ జిల్లాలో 18 కేసులు గుర్తించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 93 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,82,462కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,173కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,41,90,477 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో వెల్లడించింది.
#COVIDUpdates: 06/03/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 6, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,661 పాజిటివ్ కేసు లకు గాను
*8,79,567 మంది డిశ్చార్జ్ కాగా
*7,173 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 921#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Im5TQfDhHS