విజయనగరం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 గుడిసెలు దగ్ధం.. వృద్ధురాలు సజీవదహనం

విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం కె. సీతాపురం గ్రామంలో శనివారం జరిగిన ఆకస్మిక అగ్నిప్రమాదంలో పది గుడిసెలు దగ్ధమయ్యాయి.

By -  అంజి
Published on : 13 Dec 2025 12:00 PM IST

10 Huts Gutted, Vizianagaram, Old woman burned alive, APnews

విజయనగరం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 గుడిసెలు దగ్ధం.. వృద్ధురాలు సజీవదహనం

విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం కె. సీతాపురం గ్రామంలో శనివారం జరిగిన ఆకస్మిక అగ్నిప్రమాదంలో పది గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో పాపమ్మ అనే వృద్ధ మహిళ సజీవ దహనమైంది. స్థానికుల ప్రకారం, చలికాలంలో వేడిని ఉంచడానికి ఉపయోగించే బ్రజియర్ నుండి నిప్పురవ్వలు ఎగరడంతో మంటలు చెలరేగాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. కొందరు పర్యాటకులు కూడా ఉన్నారు.

నవంబర్ 26న హాంగ్ కాంగ్ రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం జరిగింది. ఈ ప్రమాదంలో 160 మంది మరణించారు. వాంగ్ పుక్ కోర్టు కాంప్లెక్స్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది.

Next Story