ఇరాక్ లో కొనసాగుతున్న వైమానిక దాడులు

By రాణి  Published on  4 Jan 2020 6:21 AM GMT
ఇరాక్ లో కొనసాగుతున్న వైమానిక దాడులు

ఇరాక్ లో వరుసగా రెండోరోజు అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. శనివారం హషీద్ అలా షాబీ కమాండర్ లక్ష్యంగా దాడులు జరిగాయి. బాగ్దాద్ రాజధానికి ఉత్తర ప్రాంతంలో జరిగిన దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. హషీద్ అల్ షాబీ దళానికి చెందిన మరో కమాండర్ లక్ష్యంగానే శనివారం దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు శుక్రవారం జరిగిన దాడుల్లో మరణించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండోలు, హషీద్ అల్ షాబీ దళ సభ్యులకు ఇరాక్ లోని ఇరాన్ మద్దతుదారులు సంతాపయాత్ర చేసి, మృతదేహాల్ని ఇరాన్ కు అప్పగించనున్నారు.

శుక్రవారం బాగ్దాద్ విమానాశ్రయంలో చేసిన రాకెడ్ దాడుల్లో ఇరాక్ ఆర్మీ కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీ హతమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. సైనికులు, అమెరికా దౌత్యాధికారులే లక్ష్యంగా సులేమానీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించామనీ, అందుకే ఆయన్ని హతమార్చాల్సి వచ్చిందని ప్రకటించారు. ఇటీవల బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి సహా ఇరాక్‌లోని అమెరికా మిత్రపక్షాల సైనిక స్థావరాలపై దాడులకు అతడే సూత్రధారి అని పేర్కొన్నారు. అమెరికా సంకీర్ణ దళాలకు చెందిన వందల మంది సైనికుల మరణాలకు, వేల మంది గాయపడటానికి అతడిదే బాధ్యత అని ఆరోపించారు. న్యూదిల్లీ, లండన్‌లో ఉగ్రదాడులకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

దాడి తర్వాత వెంటనే అమెరికా జెండాను ట్వీట్‌ చేసిన ట్రంప్, మరో ట్వీట్‌లో ఇరాన్‌ ఎన్నడూ యుద్ధాల్లో గెలవలేదని ట్వీట్ చేశారు. మరోవైపు అమెరికాపై ప్రతీకార దాడులు తప్పవని ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖొమైనీ హెచ్చరించారు. సోలీమని దేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన త్యాగధనుడని పార్సీ భాషలో ఆయన ట్వీట్ చేశారు.

Next Story