ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Sep 2020 12:35 PM GMT
ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 75,465 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,901 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,57,587కి చేరింది.

కొవిడ్‌ వల్ల కడపలో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, కర్నూల్‌లో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మొత్తం 67 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,846కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4,57,008 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 95,733 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 680,

చిత్తూరులో 932,

ఈస్ట్‌ గోదావరిలో 1398,

గుంటూరులో 479,

కడపలో 792,

కృష్ణలో 467,

కర్నూలులో 505,

నెల్లూరులో 711,

ప్రకాశంలో 1146,

శ్రీకాకుంలో 555,

విశాఖపట్నంలో 584,

విజయనగరంలో 583,

పశ్చిమ గోదావరి 1069 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story