ఏపీలో కొత్తగా 9,024 పాజిటివ్‌ కేసులు.. 87 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2020 12:42 PM GMT
ఏపీలో కొత్తగా 9,024 పాజిటివ్‌ కేసులు.. 87 మంది మృతి

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 58,315 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,024 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,44,549కి చేరింది.

కొవిడ్‌ వల్ల అనంతపూర్‌లో పదమూడు మంది, చిత్తూరులో పన్నెండు మంది, గుంటూరులో తొమ్మిది మంది, ప్రకాశంలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కడపలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణలో ముగ్గురు, కర్నూల్‌లో ముగ్గురు చొప్పున మొత్తం 87మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 22036 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,54,749 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 87,597 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 959,

చిత్తూరులో 758,

ఈస్ట్‌ గోదావరిలో 1372,

గుంటూరులో 717,

కడపలో 579,

కృష్ణలో 342,

కర్నూలులో 1138,

నెల్లూరులో 364,

ప్రకాశంలో 343,

శ్రీకాకుంలో 504,

విశాఖపట్నంలో 676,

విజయనగరంలో 594,

పశ్చిమ గోదావరిలో 678 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story