ఏపీ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2020 11:15 AM GMT
ఏపీ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 74,710 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,096 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,09,558కి చేరింది.

కొవిడ్‌ వల్ల కడపలో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, కృష్ణలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్‌లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విజయనగరంలో ముగుర్గు, కర్నూల్‌లో ఇద్దరు చొప్పున మొత్తం 67 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,244కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,19,891 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 84,423 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 463,

చిత్తూరులో 902,

ఈస్ట్‌ గోదావరిలో 1405,

గుంటూరులో 513,

కడపలో 419,

కృష్ణలో 487,

కర్నూలులో 337,

నెల్లూరులో 468,

ప్రకాశంలో 713,

శ్రీకాకుంలో 496,

విశాఖపట్నంలో 371,

విజయనగరంలో 487,

పశ్చిమ గోదావరి 1035 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story