జమ్మూలో ఎన్‌కౌంటర్‌..  8 మంది ఉగ్రవాదులు హతం

By సుభాష్  Published on  19 Jun 2020 6:49 AM GMT
జమ్మూలో ఎన్‌కౌంటర్‌..  8 మంది ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. షోపియన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత భద్రతా బలగాలు. కాగా, ఈ ఉగ్రవాదులు షోపియన్‌ జిల్లాలో ఐదుగురు కాగా, పంపోర్‌లో ముగ్గురిని హతమార్చాయి. ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఓ మసీదులో నక్కిఉన్నారన్న పక్కా సమాచారం మేరకు బలంగాలు రంగంలోకి దిగి ఆపరేషన్‌ చేపట్టాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు డీజీపీ దిల్బార్‌సింగ్‌ వెల్లడించారు.

కాగా, మీజ్‌ పాంపోర్‌ వద్ద ఆపరేషన్‌ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు మసీదులోకి ప్రవేశించారు. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై వారిని హతమార్చాయి. కాగా, కశ్మీర్‌లో ఇలా రోజురోజుకు ఉగ్రవాదులు ఆగడాలు పెరిగిపోతున్నాయి. భారత సైన్యం ఎన్నిసార్లు బుద్ది చెప్పినా.. వారి తీరు ఏ మాత్రం మారడం లేదు. బలగాలపై కాల్పులకు తెగబడుతుండటంతో వారి కాల్పులను తిప్పకొట్టి హతమారుస్తున్నారు.

Next Story