ఏపీలో 24గంటల్లో 7,813 కేసులు 52 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2020 12:21 PM GMT
ఏపీలో 24గంటల్లో 7,813 కేసులు 52 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో 53,681 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,813 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 88,671కి చేరింది.

కొవిడ్‌ వల్ల గుంటూరులో తొమ్మిది మంది, పశ్చిమగోదావరిలో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఆరుగురు, కృష్ణలో ఆరుగురు, కర్నూల్‌లో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు చొప్పున మొత్తం 52 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 985 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 43,255 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 44,431మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 723,

చిత్తూరులో 300,

ఈస్ట్‌ గోదావరిలో 1324,

గుంటూరులో 656,

కడపలో 294,

కృష్ణలో 407,

కర్నూలులో 742,

నెల్లూరులో 299,

ప్రకాశంలో 248,

శ్రీకాకుంలో 349,

విశాఖపట్నంలో 936,

విజయనగరంలో 523,

పశ్చిమ గోదావరిలో 1012 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story