ఏపీలో మరో 60 కరోనా పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 1 May 2020 12:16 PM ISTఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,463కి చేరింది. ఇప్పటికి వరకు ఈ మహమ్మారి భారీన పడి 33 మంది మృతి చెందారు. మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 403 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,027 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కర్నూలులో 25, గుంటూరులో 19, అనంతపురంలో 6, విశాఖపట్నంలో 2, పశ్చిమ గోదావరిలో 2 చొప్పున 24 గంటల్లో కొత్తగా కేసులు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు కర్నూలులో 411, గుంటూరులో 306, కృష్ణాలో 246 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.