ఏపీలో 24గంటల్లో 54 కొత్త కేసులు
By తోట వంశీ కుమార్ Published on 8 May 2020 12:22 PM ISTఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,320 సాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 54 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887 కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 41 మంది మృతి చెందారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 842 మంది డిశ్చార్జి కాగా.. 1004 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా అనంతపురంలో 16 కేసులు నమోదు కాగా.. విశాఖలో 11, చిత్తూరులో 3, గుంటూరులో 1,కృష్ణాలో 6, కర్నూలులో 7, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 9 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా కర్నూల్ జిల్లాలో 547, గుంటూరులో 374, కృష్ణాలో 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.