ఏపీలో మ‌రో 48 పాజిటివ్ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2020 6:21 AM GMT
ఏపీలో మ‌రో 48 పాజిటివ్ కేసులు

ఏపీలో క‌రోనా వైర‌స్‌ విజృంభణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 9,628 సాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 48 మందికి క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2205కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 49 మంది మృతి చెందారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 1353 మంది డిశ్చార్జి కాగా.. 803 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో చిత్తూరులో 8, గుంటూరులో9, క‌డ‌ప‌లో 1, కృష్ణాలో 7, క‌ర్నూలులో 9, నెల్లూరులో 9, విశాఖ‌ప‌ట్నంలో 4, ప‌శ్చిమ గోదావ‌రిలో 1 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్నూలులో అత్య‌ధికంగా 608 కేసులు న‌మోదు కాగా.. గుంటూరులో 413, కృష్ణాలో 367, చిత్తూరులో 173, అనంత‌పురంలో 122, నెల్లూరులో 149 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Untitled 2

Next Story