తెలంగాణ‌లో 800కి చేరిన క‌రోనా కేసులు.. ఈ రోజు కొత్తగా 43 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2020 4:51 PM GMT
తెలంగాణ‌లో 800కి చేరిన క‌రోనా కేసులు.. ఈ రోజు కొత్తగా 43 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రాష్ట్ర‌లో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా మ‌రో 43 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 809 చేరింది. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 31 కేసులు ఉండ‌గా.. జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో 7, రంగారెడ్డా జిల్లాల్లో 2, సిరిసిల్లలో 2, నల్లగొండ జిల్లాలో 1 కేసు న‌మోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 186 మంది ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగా.. 605మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి 18 మంది మృత్యువాత ప‌డ్డారు.

43 new corona positive cases

Next Story