భారత్‌లో 24గంటల్లో 22752 కేసులు.. 482 మరణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2020 6:00 AM GMT
భారత్‌లో 24గంటల్లో 22752 కేసులు.. 482 మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా నిత్యం 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 22,752 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 482 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి దేశంలో కేసుల సంఖ్య 7,42,417 కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 20,642 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 4,56,381 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,64, 944 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న వరకు దేశంలో 1,04,73,771 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తెలిపింది. నిన్న ఒక్క రోజులో 2,62,679 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.

ఇక భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికి.. ఈ మహ్మమారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం 61.3శాతం రికవరీ రేటు ఉన్నట్లు కేంద్ర, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదుఅవుతున్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ఇక మరణాల్లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

Next Story