ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Oct 2020 6:20 PM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 51,544 శాంపిల్స్ను పరీక్షించగా.. 1,901 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,08,924కి చేరింది.
కొవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కడపలో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, అనంతపూర్లో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 6,606కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 7,73,548 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 28,770 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులుNext Story