తెలంగాణ‌లో కొత్త‌గా 1,607 క‌రోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2020 3:12 AM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 1,607 క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,607 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి రాష్ట్రంలో 2,48,891 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 1372కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్క రోజే 937 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,27,583కు చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 19,936 యాక్టివ్‌ కేసులుండగా, వారిలో 17,134 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న ఒక్క రోజు అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 296 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ త‌ర్వాత అ‌త్య‌ధికంగా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 113, రంగారెడ్డి జిల్లాలో 115, బ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 124 కేసులు న‌మోద‌య్యాయి. మిగ‌తా జిల్లాల్లో ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోద‌య్యాయి.

Next Story