తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా ఉధృతి.. కొత్త‌గా 1590 కేసులు

By Medi Samrat  Published on  5 July 2020 4:30 PM GMT
తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా ఉధృతి.. కొత్త‌గా 1590 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 5290 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1590 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 23902 కేసులు నమోదు కాగా, 295 మంది మృతి చెందారు.



ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 1277 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 82 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 125 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 19 కేసులు, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌‌ జిల్లాలో 19 కేసులు, న‌ల్గొండ జిల్లాలో 14 కేసులు, సూర్యాపేట‌లో 23 కేసులు నమోదయ్యాయి. గ‌త ప‌దిహేను రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 12703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 10904 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1166 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌

Next Story