తెలంగాణ‌లో కొత్తగా 1,539 పాజిటివ్‌ కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2020 3:54 AM GMT
తెలంగాణ‌లో కొత్తగా 1,539 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,539 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి రాష్ట్రంలో 2,45,682 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 1362కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్క రోజే 978 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,25,664కు చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 18,656 యాక్టివ్‌ కేసులుండగా, వారిలో 15,864 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న ఒక్క రోజు అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 285 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ త‌ర్వాత అ‌త్య‌ధికంగా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 102, రంగారెడ్డి జిల్లాలో 123 కేసులు న‌మోద‌య్యాయి. మిగ‌తా జిల్లాల్లో ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోద‌య్యాయి.

Next Story