తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,286 కేసులు.. 12 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2020 4:06 AM GMT
తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,286 కేసులు.. 12 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగ‌స్టు 3న సోమవారం ) 13,787 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 12 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 68,946కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 563 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1066 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 49,675కి చేరింది. 18,708 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్ – 9

భద్రాద్రి కొత్తగూడెం- 38

జీహెచ్‌ఎంసీ -391

జగిత్యాల-22

జనగాం- 8

జయశంకర్‌ భూపాలపల్లి – 06

జోగులాంబ గద్వాల - 55

కామారెడ్డి -6

కరీంనగర్ -101

ఖమ్మం -41

ఆసిఫాబాద్ - 3

మహబూబ్‌ నగర్ -39

మహబూబాబాద్ -27

మంచిర్యాల- 21

మెదక్ – 07

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 72

ములుగు –5

నాగర్‌కర్నూల్ – 29

నల్లగొండ – 29

నారాయణపేట -04

నిర్మల్ -04

నిజామాబాద్ – 59

పెద్దపల్లి - 29

రాజన్న సిరిసిల్ల -0

రంగారెడ్డి -121

సంగారెడ్డి -15

సిద్దిపేట – 14

సూర్యాపేట-23

వికారాబాద్‌-17

వనపర్తి – 14

వరంగల్‌ రూరల్ - 11

వరంగల్‌ అర్భన్ -63

యాదాద్రి భువనగిరి -03

Next Story