ఏపీలో కొత్తగా 10,794 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2020 12:23 PM GMT
ఏపీలో కొత్తగా 10,794 కేసులు

ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 72,573 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,794 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,98,125కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో తొమ్మిది మంది, అనంతపూర్‌లో ఎనిమిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, కడపలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కృష్ణలో నలుగురు, కర్నూల్‌లో నలుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున 70 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,417 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,94,019 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 99,689 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 753,

చిత్తూరులో 927,

ఈస్ట్‌ గోదావరిలో 1244,

గుంటూరులో 703,

కడపలో 904,

కృష్ణలో 457,

కర్నూలులో 380,

నెల్లూరులో 1299,

ప్రకాశంలో 1042,

శ్రీకాకుంలో 881,

విశాఖపట్నంలో 573,

విజయనగరంలో 593,

పశ్చిమ గోదావరి 1101 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story