ఏపీలో కొత్తగా 1062 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2020 8:06 AM GMT
ఏపీలో కొత్తగా 1062 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,332 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 1062 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1051 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 9 మంది.. విదేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,259కి చేరింది. కొవిడ్‌ వల్ల కర్నూలులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 264కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 11,101 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 10,894మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా

అనంతపురంలో 87,

చిత్తూరులో 255,

ఈస్ట్‌ గోదావరిలో 125,

గుంటూరులో 173,

కడపలో 71,

కృష్ణలో 70,

కర్నూలులో 51,

నెల్లూరులో 63,

ప్రకాశంలో 02,

విశాఖపట్నంలో 38,

విజయనగరంలో 38,

పశ్చిమ గోదావరిలో 47 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story