ఏపీలో కొత్తగా 10,328 కేసులు.. 72 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2020 1:57 PM GMT
ఏపీలో కొత్తగా 10,328 కేసులు.. 72 మంది మృతి

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 8వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 63,686 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,328 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య1,96,789కి చేరింది

కొవిడ్‌ వల్ల అనంతపూర్‌లో పది మంది, తూర్పుగోదావరిలో పది మంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కృష్ణలో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో నలుగురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, కర్నూల్‌లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున మొత్తం 72 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1753కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,12,870 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 82,166 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1112,

చిత్తూరులో 755,

ఈస్ట్‌ గోదావరిలో 1351,

గుంటూరులో 868,

కడపలో 604,

కృష్ణలో 363,

కర్నూలులో 1285,

నెల్లూరులో 788,

ప్రకాశంలో 366,

శ్రీకాకుంలో 682,

విశాఖపట్నంలో 781,

విజయనగరంలో 575,

పశ్చిమ గోదావరిలో 798 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story