వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిష్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయ స్థానంలో తమ వాదనను వినిపించారు. అయితే.. అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 20కి వాయిదా వేశారు.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకా భార్య సౌభాగ్యమ్య, కూతురు సునీతా, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి లు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే.