వైఎస్‌ వివేకా హత్యకేసు పై హైకోర్టులో విచారణ

By Newsmeter.Network  Published on  13 Feb 2020 1:51 PM GMT
వైఎస్‌ వివేకా హత్యకేసు పై హైకోర్టులో విచారణ

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిష్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయ స్థానంలో తమ వాదనను వినిపించారు. అయితే.. అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 20కి వాయిదా వేశారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకా భార్య సౌభాగ్యమ్య, కూతురు సునీతా, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి లు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే.

Next Story