బావిలో దూకి వివాహిత ఆత్మహత్య..
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Nov 2019 3:14 PM IST
భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలం రాళ్లగూడెంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
భార్య బావిలో దూకిందని గమనించిన భర్త వెంటనే ఆమెను రక్షించేందుకు బావిలో దూకాడు. అయితే శైలజను కాపాడేందుకు భర్త సాయికిరణ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు భర్త సాయికిరణ్ను సురక్షితంగా బయటకు తీశారు. మృతురాలు శైలజ దంపతులకు తొమ్మిది నెలల పాప.
అమ్మ లేదని.. ఇక రాదని తెలియని ఆ పసికందు పాల కోసం తల్లడిల్లుతున్న దృశ్యం అక్కడివారి హృదయాలను కలచి వేసింది. దీంతో రాళ్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story