దిశ చట్టం ఎక్కడ జగన్‌ గారూ..? : లోకేష్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2020 10:30 AM GMT
దిశ చట్టం ఎక్కడ జగన్‌ గారూ..? : లోకేష్‌

మాస్కు పెట్టుకోమన్నందుకు నెల్లూరులో టూరిజం కార్యాలయంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడిచేసిన డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌‌ను కఠినంగా శిక్షించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ డిమాండ్‌ చేశారు. దివ్యాంగురాలు అని కూడా చూడకుండా.. హింసించిన మేనేజర్‌ను కేవలం సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం సరికాదని ట్వీట్ చేశారు.

'మానవ మృగాలు రెచ్చిపోతుంటే బాధితుల‌కు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చ‌ట్టం ఎక్క‌డ జగన్‌ గారు? మహిళలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పాల‌కులే ప్ర‌తీకారంతో చెలరేగిపోతుంటే కొంద‌రు అధికారులు అదే పంథాలో అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నెల్లూరు ఏపి టూరిజం కార్యాలయంలో మాస్కు పెట్టుకోమన్న దివ్యాంగురాలైన ఓ మ‌హిళా ఉద్యోగిని అత్యంత దారుణంగా హింసించిన‌ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ని స‌స్పెండ్ చేసి చేతులు దులుపుకోవ‌టం కాదు. క‌ఠినంగా శిక్షించాలని' నారాలోకేష్‌ డిమాండ్‌ చేశారు.



Next Story