'మీకు మాత్రమే చెప్తా' సెన్సార్ టాక్ ఏంటి..?
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Oct 2019 7:27 AM GMTవిజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. ఈ మూవీకి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెన్సార్ సభ్యులు ‘మీకు మాత్రమే చెప్తా’ టీం ను అభినందించారు. న్యూఎజ్ ఫన్ ఎంటర్ టైనర్గా రూపోందిన ‘మీకు మాత్రమే చెప్తా’సినిమా రిలీజ్కు ముందు పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ అటెన్షన్ని క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్తో పాటు విజయదేవరకొండ చేసిన ప్రమోషనల్ వీడియో సాంగ్ ‘నువ్వే హీరో’కు మంచి రెస్సాన్స్ అందుతుంది.
ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ... సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, సెన్సార్ సభ్యులు నుంచి మంచి రెస్సాన్స్ వచ్చింది. సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిన మాకు మొదటి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ చాలా స్పెషల్ గా నిలుస్తుంది. కొత్త తరహా ఆలోచనలను ప్రొత్సహించేందుకు కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్ టైన్మెంట్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ సినిమా యూత్కి బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం మాకు ఉంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్ టైనర్ గా ‘మీకు మాత్రమే చెప్తా’ నిలుస్తుంది’ అన్నారు.
నవంబర్ 1 న రిలీజ్ అవుతున్న 'మీకు మాత్రమే చెప్తా'లో తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటించారు.