వైన్స్‌ షాపు వద్ద వాచ్‌మెన్‌ సజీవ దహనం

By సుభాష్  Published on  29 April 2020 7:43 AM GMT
వైన్స్‌ షాపు వద్ద వాచ్‌మెన్‌ సజీవ దహనం

వైన్స్‌ షాపు వద్ద నిద్రిస్తున్న వాచ్‌మెన్‌పై పెట్రోల్‌ పోసి సజీవదహనం చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముళ్లపూడి వెంకటేష్‌ అనే వ్యక్తి ప్రభుత్వ వైన్స్‌ షాపు వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

రోజువారీగా నిన్న అర్థరాత్రి విధులు నిర్వహిస్తూ మంచంపై పడుకున్న వెంకటేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. అయితే షాప్‌లో దొంగతనాలు జరగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, వ్యక్తిగత కక్షలతో వెంకటేష్‌ను ఇలా సజీవ దహనం చేశారా.. లేక ఇంకేమైన కారణాలున్నాయా అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story