ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
184 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా
By Medi Samrat Published on 26 Nov 2021 12:28 PM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 29,731 పరీక్షలు నిర్వహించగా.. 184 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,198కి చేరింది. నిన్న కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,432గా ఉంది. 24 గంటల వ్యవధిలో 214 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,55,603కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,163 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,03,16,261 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
#COVIDUpdates: 26/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 26, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,69,303 పాజిటివ్ కేసు లకు గాను
*20,52,708 మంది డిశ్చార్జ్ కాగా
*14,432 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,163#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/X6j9LoX4uZ