కేసీఆర్‌ పెట్టిన శాపం అక్బరుద్దీన్‌కు తెలిసి ఉండకపోవచ్చు

By సుభాష్  Published on  26 April 2020 1:02 AM GMT
కేసీఆర్‌ పెట్టిన శాపం అక్బరుద్దీన్‌కు తెలిసి ఉండకపోవచ్చు

సినీ నటి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాడుతున్న తరుణంలో కొన్ని లోపాలున్నా..వాటిని పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి బాసటగా నిలువాలని ఇటీవల కేసీఆర్‌ మీడియా సమావేశంలో చెప్పారని, కానీ గాంధీ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని రాసిన ఓ మీడియా యాజమాన్యానికి కరోనా రావాలని శాపం పెట్టారని విజయశాంతి మండిపడ్డారు. వైద్య సదుపాయాలు లేవన్నందుకే కరోనా రావాలన్న కేసీర్‌.. గాంధీ ఆస్పత్రి జైలు మాదిరిగా మారిందని విమర్శలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని రాములమ్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బహుశా కేసీఆర్‌ పెట్టిన శాపం గురించి అక్బరుద్దీన్‌కు తెలిసి ఉండకపోవచ్చని, లేకుండా కేసీఆర్‌ పెట్టిన శాపాలు తనకు వర్తించవనే ధీమాలో అక్బరుద్దీన్‌ ఉండొచ్చని ఎద్దేశా చేశారు. రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసీఆర్‌ శాపం పెడతారా.. లేక చూసీ చూడనట్లు ఉండిపోతారా అంటూ విజయశాంతి వ్యాఖ్యనించారు.

Next Story