ఉత్తరప్రదేశ్లో వరుణుడి కరాళ నృత్యం
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Sep 2019 3:17 PM GMTయూపీ: ఉత్తరప్రదేశ్ను వరుణుడు వణికిస్తున్నాడు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 48 గంటల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్నో, అమేధీ, హర్దయ్ జిల్లాల్లో వర్షం ధాటికి ఊళ్లు అతలాకుతలమయ్యాయి. ఈ రోజు కూడా భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పాము కాటులు, కొట్టుకుపోవడం, పిడుగులు పడటంతో మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రతాప్ ఘఢ్, రాయ్బరేలీలో 6, ఐదుగురు అమేథీ, చందౌలి, వారణాసిలో 8 మంది, ప్రయాగ్ రాజ్, బారాబంకి, మహోబాలో ముగ్గురేసి చొప్పున మరణించారు. పలు చోట్ల మృతులు నమోదవుతున్నారు. వరదల ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని యూపీ ప్రభుత్వం సూచించింది.
Next Story