బ్రేకింగ్ : ప‌సుపు రైతుల‌కు కేంద్రం శుభ‌వార్త‌.. మ‌రికాసేప‌ట్లో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Feb 2020 8:32 AM GMT
బ్రేకింగ్ : ప‌సుపు రైతుల‌కు కేంద్రం శుభ‌వార్త‌.. మ‌రికాసేప‌ట్లో..

కేంద్రం కాసేప‌ట్లో పసుపు రైతులకు శుభ‌వార్త వినిపించ‌నుంది. ప‌సుపు బోర్డు ఏర్పాటుపై ప్ర‌క‌ట‌న చేయ‌నుంది. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ప‌లుమార్లు ప్ర‌క‌టించిన‌ట్లుగా.. త్వ‌ర‌లోనే ప‌సుపు రైతులు ప‌సుపు బోర్డు ఏర్పాటు విష‌యంలో శుభ‌వార్త వింటారని తెలిపిన‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి అనుకూలమైన నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించి కేంద్రం మ‌రికాసేప‌ట్లో.. అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

ఇదిలావుంటే.. ద‌శాబ్దాలుగా పసుపు రైతులు బోర్డు ఏర్పాటు చేయాలని, మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా ఈ విషయమై పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులు తమకు కూడా రాయితీలు, ప్రొత్సహకాలు అందుతాయనే భావనలో ఉన్నారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధతు ధరలు ఉన్నా పసుపుకు మాత్రం మద్ధతు ధర లేదు. పసుపు సుగంధ ద్రవ్యాలలో ఉండడం చేత‌నే దీనికి మద్ధతు ధర లేదు. వ్యాపారులే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుండ‌టంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ఈ నేఫ‌థ్యంలో కేంద్రం ప‌సుపు రైతుల ప‌ట్ల అన‌కూల నిర్ణ‌యం తీసుకోనుండ‌టం శుభ‌ప‌రిణామంగా భావించ‌వ‌చ్చు.

Next Story