టర్కీ బాంబు దాడులపై భారత్ ఆందోళన

By Medi Samrat  Published on  11 Oct 2019 5:51 AM GMT
టర్కీ బాంబు దాడులపై భారత్ ఆందోళన

సిరియాలోని ఈశాన్య ప్రాంతాలపై టర్కీ రెండో రోజు కూడా వైమానిక దాడులు చేసింది. కుర్దుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై బుధవారం టర్కీ మరోసారి బాంబుల వర్షం కురిపించింది. కాగా దాడిలో మహిళలు, పిల్లలు సహా 50 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడుల్లో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. 64 వేల మంది కుర్దులు తమ ఇళ్లు, గ్రామాలను విడిచి పారిపోతున్నారు. అయితే తాము అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు టర్కీ ప్రకటించింది. మరోవైపు సిరియాపై టర్కీ చేస్తున్న బాంబు దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీ చర్యల వల్ల అక్కడి స్థానికలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని టర్కీకి భారత్ హితవు పలికింది. సిరియా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, సంయమనం పాటించాలని భాతర విదేశాంగ శాఖ సూచించింది.

Next Story