హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ -2 ఫలితాలు విడుదలయ్యాయి. 1032 పోస్ట్లకు గాను, 1027 పోస్ట్లకు ఫలితాలు విడుదల చేశారు. 259 డిప్యూటీ తహశీల్దార్, 284 ఎక్సైజ్ ఎస్ఐఎస్, 136 కమర్షియల్ టాక్సిస్, ఇంకా మునిసిపల్ కమిషనర్ లు, ఇతర పోస్ట్లను రిలీజ్ చేశారు. ఈమేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ట్వీట్ చేశారు. ఎంపికైన అభ్యర్ధులకు గంటా చక్రపాణి శుభాకాంక్షలు తెలియజేశారు.