తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే..
By సుభాష్ Published on 10 March 2020 12:47 PM GMTతెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు ఒంటిపూట బడులను ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యా కమిషనర్ చిత్రా రామచంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఇక వార్షిక పరీక్షల అనంతరం ఏప్రిల్ 23వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
Next Story