తెలంగాణలో కొత్తగా 983 పాజిటివ్ కేసులు
By సుభాష్ Published on 3 Aug 2020 4:16 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 983 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 67,660కి చేరింది. కరోనాతో 11 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 551కి చేరింది. తాజాగా కరోనా నుంచి కోలుకుని 1019 డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 48,609కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,500 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది.
ఇక జిల్లాల వారీగా కేసులు:
గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 273 కేసులు నమోదు అయ్యాయి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి 408, ఆదిలాబాద్ జిల్లాలో 16, వరంగల్ అర్బన్ 57, వరంగల్ రూరల్ 25, భద్రాది కొత్తగూడెం 16, జగిత్యాల్ 12, జనగాం 13, జయశంకర్ భూపాలపల్లి 12,జోగులమ్మ గద్వాల్ 12, కామారెడ్డి 28, కరీంనగర్ 54, ఖమ్మం 23, వనపర్తి 26, కొమరం భీమ్ అసిఫాబాద్ 7, మహబూబ్ నగర్ 21, మహబూబాబాద్ 18, మంచిర్యాల్ 1, మెదక్ 18, వికారాబాద్ 4, ములుగు 14, నాగర్ కర్నూల్ 32, నల్గొండ 11, నారాయణ్పేట్ 2, నిర్మల్ 2, నిజామాబాద్ 42, పెద్దంపల్లి 44, రాజన్న సిరిసిల్ల 20, రంగారెడ్డి 73, సంగారెడ్డి 37, సిద్ధిపేట్ 6, సూర్యాపేట 11, యాద్రాది భువనగిరి 5 కేసులు నమోదయ్యాయి.