తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

By సుభాష్  Published on  2 Oct 2020 3:44 AM GMT
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,95,609 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1145 మంది మృత్యువాత పడ్డారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,437 మంది కోలుకోగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,65,844 చేరుకుంది. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.6 శాతం ఉన్నట్లు తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్‌ కేసులు 28,620 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 23,372 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 293, కరీంనగర్‌ 114, ఖమ్మం 104, మేడ్చల్‌ మల్కాజిగిరి 173, నల్గొండ 109, రంగారెడ్డి 171 ఉన్నాయి.

Next Story