తెలంగాణ‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా 199 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2020 3:47 PM GMT
తెలంగాణ‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా 199 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా.. 5 గురు మృతి చెందార‌ని తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2698 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 82 మంది మృతి చెందారు. క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి తెలంగాణలో ఒక్క రోజు వ్య‌వ‌ధిలో న‌మోదు అయిన అత్య‌ధిక కేసులు ఇవే.

ఈ రోజు న‌మోదు అయిన కేసుల్లో తెలంగాణ‌కు సంబంధించిన‌న‌వి కేసులు 196. అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 122 కేసులు న‌మోదు కాగా.. రంగారెడ్డిలో 40, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో 3, సూర్యాపేటలో 1, నిర్మ‌ల్‌లో 1, వ‌రంగ‌ల్ అర్భ‌న్ 2, యాద్రాదిలో 1, మేడ్చ‌ల్‌లో 10, జ‌గిత్యాల 3, మెద‌క్ 3, ఖ‌మ్మం 9, జ‌న‌గాంలో ఒక్క‌రికి కరోనా నిర్ధారణ అయ్యింది. మొత్తం న‌మోదు న‌మోదైన కేసుల్లో ఇప్ప‌టి వర‌‌కు 1428 డిశ్చార్జి కాగా.. 1188 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలావుంటే తెలంగాణ‌లో మొదట్లో కేసుల సంఖ్య తగ్గుముఖం ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన తర్వాత దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలువుతుంది. అయినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది.

TS corona cases rise to 2698

Next Story